వారాహి యాత్ర విజయవంతం కావాలని జనసైనికుల ప్రత్యేక పూజలు

గుడిపాల మండలం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనహితం కోరే పవన్ కళ్యాణ్ చేపడుతున్న “వారాహి యాత్ర” విజయవంతం కావాలని, కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో, స్వామివారికి 101 టెంకాయల సమర్పణ జరిపించి మండల జనసైనికులు మొక్కుబడి తీర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసైనికులు మల్లెల శివ, హేమంత్ చక్రాల, రామ్మూర్తి నాయుడు, ఆదికేశవులు యాదవ్, బాబు యాదవ్, రాంభద్రాపురం సురేష్, హరీష్ రాయల్, అంబటి గోపి, కేశవులు రాయల్, బాలకృష్ణ యాదవ్, డేశెట్టి రాజా, జయ సూర్య, మురళీకృష్ణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.