వారాహి యాత్ర విజయవంతం కావాలని రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

  • రాజంపేట నియోజకవర్గం టి సుండుపల్లి మండల పరిధిలో తిమ్మసముద్రం గ్రామంలో పీలేరు వెళ్ళే రోడ్డు మీద వెలసిన శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి వారి గుడిలో అర్చన, పూజ కార్యక్రమం చేపట్టిన రామ శ్రీనివాస్

రాజంపేట: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కత్తిపూడిలో చేపట్టబోతున్న శుభసందర్బంగా వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి వారి గుడిలో భక్తి శ్రద్ధలతో పవన్ కళ్యాణ్ గారు పేరు మీద జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ నేతృత్వంలో అర్చన మరియు ప్రత్యేక పూజలు చేసి అనంతరం పార్టీ నాయకులు, జనసైనికులు, ఆత్మీయులు, గ్రామపెద్దలు, అభిమానులు సమక్షంలో వారాహి యాత్రకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారాహి యాత్రకు అడంకులు తొలిగిపోయి, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభ్యున్నతికి మరియు భావితరాలకు మంచి భవిష్యత్తు అందించడానికి ఆ దేవదేవుడు ఆశీస్సులతో సమసమాజం కోసం రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ఓవయ నాయుడు, జనసేన వార్డు మెంబర్ గుగ్గిళ్ళ వెంకటేష్, పార్టీ శ్రేణులు రాజగోపాల్, సలీమ్, మున్నా, రవీంద్ర, అంజి, ఇరగయ్య, నేతి వెంకటేష్, బుజ్జి, మంజు, బాబు, బలిజసంగం నాయకులు, జయరామ్, రామంజులు, గ్రామపెద్దలు, స్థానికులు, ఆత్మీయులు, చుట్టుపక్కల గ్రామాల వారు సుండుపల్లి, వీరబల్లి మండలాలకు చెందిన నాయకులు, జనసైనికులు, యువకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.