మండల స్థాయి జనసైనికుల ఆత్మీయ సమావేశం

చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం, జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపు లేటి హరిప్రసాద్ సారధ్యంలో ఆదివారం తంబళ్లపల్లె నియోజకవర్గము, ములకలచేరువు మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో మండల స్థాయి జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాయినాథ్ మాట్లాడుతూ… జనసేన పార్టీ అభివృద్ధికి అందరూ గ్రామ స్థాయిలో అందరూ కష్టపడాలి అని కోరారు. అదేవిధంగా మండల కమిటీ సభ్యులు ఎన్నిక వారి విధులు భాద్యతలు గురించి వివరించారు. ఈ సమావేశంలో అధికార పార్టీ మరియు టీడీపీ కి సంబంధించిన 50 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో అక్షర హరిప్రసాద్, పూల శ్రీనివాసులు, మల్లెమ్ అనిలు, పూల రెడ్డి సురేష్, షోరూమ్ సూరి, చవల భానుప్రకాశ్, దేవేంద్ర, నాగరాజు, మధు మరియు జనసేన సభ్యులు పాల్గొన్నారు.