సత్యవేడు నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మరియు జిల్లా కార్యదర్శులు కొప్పల లావణ్యకుమార్, హేమకుమార్ సత్యవేడు నియోజకవర్గం నాయకుడు హేమసుందరం ముదిరాజ్ ల ఆదేశాల మేరకు సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెం, బి.ఎన్ కండ్రిగ, సత్యవేడు మండలాల అధ్యక్షులకు చిరంజీవి యాదవ్, బాషా, రూపేష్ ఆధ్వర్యంలో చిలమత్తూరు, నాగానందపురం, కరిపాకం, ఇట్లపాలెం, గాజులపేళ్ళురు, కంచనపుత్తూరు, కాంపాలెం, నేరినికండ్రిగ తదితర గ్రామాలలో జనసైనికులతో ఆత్మీయసమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, జనసేన సిద్ధాంతాలు వివరించారు, ఈ కార్యక్రమంలో నాయకులు దినేష్, కులశేఖర్, మునేంద్ర, కృష్ణా, ఢిల్లీబాబు, చెంచయ్య, తదితరులు పాల్గొన్నారు.