శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

మదనపల్లి నియోజకవర్గం: తెలుగుజాతి ఖ్యాతిని, కీర్తిని కొనియాడిన గొప్ప యోధులు, విజయనగర సామ్రాజ్యదీశ్వరుడు, తులాల వంశ ఆణిముత్యం, ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగ సార్వభౌముడు హరిహర బుక్క రాయలు పేరు మీదనే ఏర్పడిన సత్యసాయి జిల్లా బుక్కపట్నం గ్రామ నడి బొడ్డున శ్రీ కృష్ణ దేవరాయలు వారి కాంస్య విగ్రహ ప్రతిష్ఠ ఆవిష్కరణ మహోత్సవ వేడుకకు కార్యక్రమం నిర్వాహకులు పేదరాశి సుబ్రహ్మణ్యం ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు హరిప్రసాద్ మరియు జనసైనికులు శేఖర్, విజయ్ కుమార్ తదితరులు.. ఈ సారి ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించే దిశగా బలిజలు పని చేయాలి అని రాష్ట్ర నలుమూలల నుండి విచ్బేసిన బలిజ నాయకులు ముక్త కంఠంతో చెప్పారు.. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన స్టేట్ సెక్రటరీ ఆమంచి స్వాములుని దాసరి రాముని మర్యాదపూర్వకంగా సాలువా కప్పి సన్మానించిన మదనపల్లి జనసేన నాయకులు.