జనం కోసమే జనసేనకు శ్రీకారం చుట్టిన శ్రీరామ రామాంజనేయులు

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టిన జనం కోసమే జనసేన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి జనసేన గురించి వివరిస్తూ.. మొదటిరోజు సిటిఎం పంచాయతీ రైల్వే గేట్ ప్రాంతం, బజారు వీధి, మంగళ వీధి, ప్రాంతంలో జనసేన ప్రచారం చేయడం జరిగింది. కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం చేస్తున్న పోరాటానికి సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ వాటిని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, హరిప్రసాద్, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, ఆకుల శంకర, పతి, సుప్రీం హర్ష, సోను, సిటిఎం యువ నాయకులు చిన్న రెడ్డి, గంగాధర్, కొక్కంటి గణపతి, గోపి, చలపతి, సత్యనారాయణ, వెంకటరమణా రెడ్డి, టి.రవీంద్ర, పూజారి రమేష్, పూజారి శ్రీనివాస్, వి.సురేంద్ర, యమ్. చలపతి, ధనాంజనేయులు, మహేష్, బబ్లు, శశిభూషన్, గణేష్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.