శ్రీశ్రీశ్రీగంగమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేల్ మండల కేంద్రంలో కాపు సంక్షేమ యువసేన లీడర్ అబ్బిగారి గోపాల్, జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, అక్కడి స్థానికులు, వివిధ ప్రాంతాల ప్రజలందరితో కలిసి జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ శ్రీశ్రీశ్రీగంగమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదాసు నరసింహ, పగడాల శివ, ఓబినేని శివ, తదితరులు పాల్గొన్నారు.