శ్రీశ్రీశ్రీకోతపురమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా, రాజంపేట పరిధిలోని టి. సుండుపల్లి మండల పరిధిలోని పెద్దబలిజపల్లిలో సోమవారం సోదరులు మదన్మోహన్, ఇరగయ్య రాయచోటి నియోజకవర్గ పరిధిలోని సంబేపల్లి మండల పరిధిలో దుద్యాల గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీకోతపురమ్మ తల్లి జాతర సందర్భంగా మొక్కులు చెలించుకొనుటకు చాందని బండి, చక్కబజన, డప్పువాయిద్యాలు, బాణసంచాలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామపెద్దలు, స్థానికగ్రామస్థులు, యువకులు, వివిధ ప్రాంతాల నుంచి బంధుమిత్రులతో కలిసి పాల్గొన్నారు.