సుభద్రపురంలో శ్రీకాకుళం జిల్లా జనసేన సమావేశం

ఉత్తరాంధ్ర రీజినల్ మహిళా కమిటీ నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా నాయకురాలు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గ కేంద్ర కార్యాలయం సుభద్రపురంలో శ్రీకాకుళం జిల్లా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి జనసేన వీరమహిళలు పాల్గొనడం జరిగింది.