చెన్నై వరద ప్రభావిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతుండడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేడు పర్యటించారు. చెన్నైలో వరద పరిస్థితిపై సిఎం స్టాలిన్ సమీక్షించారు. వరద ప్రాంతాల్లో ఆహార పంపిణిని స్టాలిన్ పరిశీలించి, పంపిణి కార్యక్రమంలో స్వయంగా పాల్గన్నారు. వర్షాలు తగ్గేవరకు అమ్మ క్యాంటీన్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఉచిత ఆహారం అందించాలని స్టాలిన్ ఆదేశించారు. వాతావరణ శాఖ నేటి నుండి మూడు రోజులపాటు (నవంబర్ 11 వరకు)తమిళనాడులో రెడ్ అలెర్ట్ ప్రకటించింది.