భూ నిర్వాసితులకు అండగా ఉంటాం: వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మేము భూములు కోల్పోయాము.. ప్రభుత్వం మాకు ఎకరానికి 4 లక్షల రూపాయలు ఇచ్చి వదిలించుకొని మాకు అన్యాయం చేసేశారు.. నాయకులను నమ్మి మోసపోయిన మా తరపున పోరాడి మాకు న్యాయం జరిగేలా చూడాలని కుమ్మెర గ్రామంలోని భూనిర్వసితులు జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది. దీంట్లో భాగంగా మంగళవారం వంగ లక్ష్మణ్ గౌడ్ ను కలిసి తమకున్న సమస్యల పట్ల వివరించడం జరిగింది. వారి సమస్యలు వివరించిన తరువాత వంగ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ మీ తరపున పోరాడటానికి మేము సిద్ధం. నష్టపోయిన భూ నిర్వాసితులందరూ కుడా ధైర్యంగా ముందుకొచ్చి పోరాడాలని నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున మద్దతు తెలపడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ త్వరలో తెలియజేస్తామని వంగ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు మహేష్ గౌడ్, ఆరిఫ్, సూర్య, వంశీ రెడ్డి, రాజు నాయక్, నరసింహ, తిరుపతి, మహేష్, శివ కుమార్, పూస శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.