జనసేన కార్యకర్తలు, నాయకులతో సమావేశమైన బైరపోగు సాంబశివుడు

కొల్లాపూర్ నియోజకవర్గం పరిధి ఉన్న కోడేరు మండల కేంద్రంలో జనసేన కార్యకర్తలతో, నాయకులతో కొల్లాపూర్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ బైరపోగు సాంబశివుడు సమావేశమై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ చిన్నంబాయి మండలంలో అన్ని జిల్లాలకు విస్తరించాలని, ప్రజా సమస్యలపై జనసేన కార్యకర్తలు, జనసైనికుల దృష్టి పెట్టాలని, ప్రజలకు చేరువయ్యే విధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలమైన ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదగాలని, ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడు లాగా పని చేయాలని, పార్టీని కాపాడుకొనే బాధ్యత తమ పైన, పవన్ కళ్యాణ్ ను అభిమానించే ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి, ఈ పార్టీని ప్రజలకు సమస్యలపై పోరాటం చేసే దిశగా కార్యచరణ రూపొందించుకోవాలని తెలిపారు. అలాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానాన్ని, పార్టీ సిద్ధాంతాలని, పార్టీ యొక్క లక్ష్యాలని ప్రజలకు మేలు అయ్యే విధంగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులని ప్రజలకు ఎంతైనా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవి ప్రజలకి చేరువయ్యే విధంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త పనిచేసి రాబోయే రోజుల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలమైన పార్టీగా, ప్రజల యొక్క పార్టీగా, బడుగు బలహీన వర్గాల పార్టీగా అన్ని వర్గాల ప్రజల పార్టీగా, కొత్త తరానికి రాజకీయ వేదిక సృష్టించే పార్టీగా ప్రజలు అనుకునే విధంగా కార్యక్రమం ఉండాలని బైరపోగు సాంబశివుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోడేరు మండలం నాయకులు ఎజ్జు ఆంజనేయులురవి, మూర్తి, పులేందర్, శివ పాల్గొన్నారు.