పార్టీ బలోపేతం దిశగా అడుగులు – పత్రికా సమావేశంలో రాయపరెడ్డి కృష్ణ

మాడుగుల నియోజకవర్గంలో ఉన్న కే.కోటపాడు మండల హెడ్ క్వార్టర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మాడుగుల నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా మాడుగుల నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేదని తెలియజేశారు. నియోజకవర్గంలో ఉన్న పల్లెటూరు మారుమూరు ప్రాంతాలకు సరైన రవాణా సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో ప్రభుత్వం నుంచి వచ్చే అంబులెన్స్ స్పందించక తన మనసును కలచివేసిందని, తన యొక్క సొంత నిధులతో నియోజకవర్గంలో రెండు అంబులెన్సులను ఏర్పాటు చేశారని, అవి వచ్చే గురువారం లేదా శుక్రవారం రోజున కే కోటపాడు మండలం మరియు దేవరపల్లి మండలానికి ఒక అంబులెన్సును కేటాయిస్తామని కె.కోటపాడు మండల నాయకులు కుంచా అంజిబాబు, ఉగ్గిన త్రినాథ్ ఆధ్వర్యంలో కె. కోటపాడు మండల జనసైనికులు సమక్షంలో తెలియజేశారు. కె.కోటపాడు మండలానికి ఒక అంబులెన్స్ ను కేటాయించినందుకు అంజిబాబు రాయపరెడ్డి కృష్ణకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న, శివాజీ, ఉమామహేష్, వరహాల, రాజు, శ్రీను, రాజు చంద్రశేఖర్ చైతన్య, చంద్రశేఖర్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.