ఎన్డీఏ కూటమి విజయం తధ్యం: తీగల

  • గ్రామాల్లో కానరాని అభివృద్ధి

జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ఉమ్మడి నెల్లూరుజిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. గూడూరు మండలంలోని కాండ్ర గ్రామంలో మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులతో కలిసి షణ్ముఖవ్యూహం, సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు వైసీపీ ప్రభుత్వం పరిష్కారం చూపించలేదని, గడచిన ఐదు ఏళ్ళల్లో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేకపోయిందన్నారు. ఎన్‌డిఎ కూటమి మహిళలు కోసమే ప్రత్యేకంగా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిందనిజరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాశిం సునిల్ కుమార్ కు సైకిల్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి వెలగపూడి వరప్రసాద్ కు కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం,బిజెపి నాయకులు పాలిచెర్ల భాస్కర్, నవీన్ రాజు, జగదీష్ రాజు, దశ్యంత్ రాజు, మణి, మోహన్ రాజు, భూపతి రాజు, నవీన్ శ్రీనాథ్, పెంచలయ్య, దావుద్, శ్రీను, బాలు, ప్రభాకర్, వెంకటేష్, మహేష్, రఫీ పాల్గొన్నారు.