మత్స్యకార అభ్యున్నతి యాత్ర విజయవంతం: శెట్టిబత్తుల రాజబాబు

తూర్పుగోదావరి, మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా అమలాపురం నియోజకవర్గ పరిధిలో ఎన్. రామేశ్వరం, వాసాలతిప్ప గ్రామాల్లో జరిగిన మత్స్యకారుల సమావేశం విజయవంతం చేసినందుకు అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, పిఏసి సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, అమలాపురం నియోజకవర్గ జనసైనికులు, నాయకులు, వీరమహిళలు, సర్పంచ్ లు, ఎంపిటిసి లు, కౌన్సిలర్లకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.