వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కు 10 రోజుల సీబీఐ కస్టడీ

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో కోర్టు సునీల్ యాదవ్ కు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సునీల్ ను గోవాలో అరెస్ట్ చేయగా, ఈ నెల 4 నుంచి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ కుమార్ తీరు అనుమానాస్పదంగా ఉన్నట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.