రానున్న ఎన్నికలలో జనసేనను ఆదరించండి

  • రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలంలోని పలు గ్రామాలలో శివరాంపురం, నాగిరెడ్డిపల్లిలో 115వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించి జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి తీసుకెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను గాజు గ్లాస్ గుర్తును ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అక్కడ గ్రామ ప్రజలతో మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ.. ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని దోచుకోవడం దాచుకోవడం అలాగే ఇసుక మాఫియా, మద్యం మాఫియా, తప్ప ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని ఆ గ్రామ ప్రజలకు వివరించారు. ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, నిత్యవసర సరుకులు, అన్ని పెంచడం దారుణం అని ఈ ప్రభుత్వంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు, గోపి, కిషోర్, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.