బూరుగుపూడిలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర 3వ రోజు

  • ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే ఈ అరాచక వైసిపి ప్రభుత్వం పోవాలి!
  • బీసీలకు రాజ్యాధికారం వారి సాధికారిక కోసం పవన్ కళ్యాణ్ గారు పరితపిస్తున్నారు!
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అవినీతి వైసీపీకి ఓటేసిన పాపానికి ఇప్పుడు కుమిలిపోతున్నారు!

రాజానగరం: కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామంలో “జనం కోసం జనసేన” ‘మహాపాదయాత్ర’.. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో భాగంగా అడుగడుగునా హారతులు ఇస్తూ.. బూరుగుపూడి గ్రామ ప్రజానీకం శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి ఘన స్వాగతం పలికారు. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న ఈ వైసీపీ సర్కార్ను ప్రజలందరూ ఐక్యమై త్వరగా ఇంటికి పంపాలని.. సమాజానికి ఎంతో చేయాలని పరితపిస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీపరుడికి ఒక అవకాశం ఇచ్చి, ప్రజలందరూ ఆశీర్వదించి జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ పాదయాత్రలో బూరుగుపూడి సీనియర్ జనసేన నేతలు, జనసైనికులు, వీరమహిళలు అలానే మండలంలోని ఇతర జనసేన నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.