స్వామి వివేకానంద మాటలు తూటాల కంటే వేగం: దేశంశెట్టి సూర్య

పొన్నూరు: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పొన్నూరు జనసేన కార్యాలయంలో జనసేన ఆధ్వర్యంలోస్వామి వివేకానందకు నివాళులర్పించారు. అనంతరం జిల్లా జాయింట్ సెక్రటరీ సూర్య మాట్లాడుతూ భారతదేశం ఆణిముత్యం, యువతకు స్ఫూర్తి వివేకానంద. ఆయన మాటలు తూటాల కంటే వేగంగా ప్రయాణిస్తాయి, ఆ మాటలు ఏదో తెలియని ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపి.. విజయం దిశగా అడుగులు వేయిస్తాయి. వివేకానందుడు కేవలం 39 సంవత్సరాలు జీవించినప్పటికీ భారతదేశ ఖ్యాతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లూరి అప్పారావు, పొన్నూరు మండల అధ్యక్షుడు నాగిశెట్టి సుబ్బారావు, మండల ఉపాధ్యక్షుడు పెరవల్లి అరుణ్ ప్రసాద్, చందు శివ కోటేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రసాని నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.