బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్, బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులకు, వెనుకబడిన వర్గాలకు సమాన హక్కుల కోసం పాటుపడిన వ్యక్తి, అంటరానితనంపై పోరాటం చేసిన మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు మల్లెల సంతోష్, గుండా సాయి చంద్, కొలుగూరి అనిల్, బత్తుల జగదీష్, వెల్పుల చందు తదితరులు పాల్గొన్నారు.