జనసేనాని స్పూర్తితో తోట వాసు లక్ష విరాళం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన ఎందరో కౌలు రైతుల కుటుంబాల కోసం, ఆ కుటుంబాలకి కొంతైనా సాయపడాలానే సదుద్దేశంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక్కో కుటుంబానికి, ఒక్కో లక్ష రూపాయిల చొప్పున ప్రకటించి.. తన వంతుగా ఆయన కష్టార్జీతం నుంచి 5 కోట్ల రూపాయిలు జనసేన పార్టీకి అందించడం జరిగింది.. పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రెటరీ తోట వాసు తన వంతు సాయంగా 1 లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వటానికి ముందుకు వచ్చిన సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ ఆకివీడు మండల జనసైనికులు హృదయ పూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు.