రంగా వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న తంబళ్లపల్లి

నందిగామ నియోజకవర్గం: జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నందిగామ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి. 20వ వార్డు అనాసాగరం, నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్, పరిటాల గ్రామం, కంచికచర్ల మండలంలోని కంచికచర్ల పట్టణం, చందర్లపాడు మండలం మునగానపల్లి గ్రామం ఇలా పలుచోట్ల వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు, చిత్రపటాలకు ఘనంగా నివాళులు అర్పించారు. తర్వాత చందర్లపాడు మండలం నూకేశ్వరి అమ్మవారి తిరునాళ్లకు హాజరై, అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు జరిపించి, తరువాత తిరుణాలలో వచ్చే భక్తులకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నందిగామ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి. ఈ కార్యక్రమంలో పూజారి రాజేష్, తాటి శివకృష్ణ, తాటి వెంకటకృష్ణ, మేకపోతుల శ్రీలక్ష్మి, ఆదిలక్ష్మి, కామిశెట్టి వెంకటేశ్వరరావు, వరుణ్ పొలిశెట్టి, వెంకటేష్ పులి శెట్టి, కొమవరపు నరసింహా స్వామి, తెప్పల కోటేశ్వరరావు, నాయిని సతీష్, కొమ్మ నరేష్, చలమల వీరబాబు, టిడిపి కంచికచర్ల మండల అధ్యక్షుడు కోగంటి బాబు, మరియు టిడిపి నాయకులు జనసైనికులు, వీరమహిళలు టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.