దళిత వాడల్లో పర్యటించిన తంబళ్ళపల్లి రమాదేవి

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలోని పూతలపట్టు మండలం, ఐరాల మండలంలోని దళిత వాడలు అయినటువంటి బూసిపల్లి, చిన్న వెంకటంపల్లి ప్రాంతాలలో సీనియర్ జనసేన నాయకురాలు శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా, అక్కడి దళిత నాయకులను కలిసి, జనసేన పార్టీ సిధ్ధాంతాలను వారికి వివరించారు. తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు వారంతా కలిసి, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని బలపరచాలని వారిని కోరారు. ప్రస్తుత అధికార ప్రభుత్వం దళితుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాల వారి పట్ల చూపిస్తున్న వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దళిత నాయకులు మరియు కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.