హరికృష్ణ కుటుంబానికి నష్ట పరిహారానికై తంబళ్ళపల్లి పోరాటం

  • కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన పాలంకి హరికృష్ణ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించిన జనసేన సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ: పరిటాల గ్రీన్వే బిల్డింగ్స్ బ్రిక్స్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న పాలంకి హరికృష్ణ గత తొమ్మిది నెలలు ముందు కంపెనీ యాజమాన్య అశ్రద్ధతో ప్రమాదవశాత్తూ మరణించాడు. ఆ కంపెనీ యజమాని మభ్యపెట్టడంతో వాళ్లకి అందించవలసిన నష్టపరిహారం ఇవ్వడం లేదు. సమస్యను జనసేన సీనియర్ నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి సీరియస్ గా తీసుకొని ఆ కంపెనీ ఎండితో మాట్లాడి వాళ్లకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ కుటుంబ సభ్యులు జనసేన పార్టీకి రమాదేవికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిటాల జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు కొమ్మ నరేష్, పురమా ప్రసాద్, పురామ కాళేశ్వరరావు, మాణిక్యాల బ్రహ్మం, దేరంగుల రామక్రిష్ణ, పసుపులేటి రామారావు, పూరమ రత్నబాబు, గోపీకృష్ణ, గంగాధర్, కరిముల్లా నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొని కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది.