పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉత్తర్వులు స్వీకరించిన తమిళ సై

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలంగాణ గవర్నర్ తమిళిసైని నియమితులయ్యారు.. తెలంగాణా గవర్నర్ ఉన్న తమిళ సై పుదుచ్చేరి లెప్టినెంగ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.. పుదుచ్చేరి ఎల్జీగా ఉన్న కిరణ్‌బేడీని మంగళవారం రాత్రి అకస్మికంగా కేంద్రం తొలగించింది.. ఆ స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైని ఎల్జీగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు స్వీకరించాలంటూ రాష్ట్రపతి జారీ చేసిన అపాయింట్‌మెంట్ ఉత్తురులను ఇవాళ తమిళిసై అందుకున్నారు. ఉత్తర్వులు అందుకోవడం సంతోషంగా ఉన్నట్లు గవర్నర్ తన ట్విట్టర్‌లో తెలిపారు. పుదుచ్చేరి రెసిడెంట్ కమిషనర్ ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు.. అనంతరం ఆయన రాజ్‌భవన్ భవన్ కి వెళ్లిన గవర్నర్ తమిళిసైకి అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందజేశారు.