టిడిపి-జనసేన-బిజెపి సమన్వయ సమావేశం

కళ్యాణదుర్గం, అనంతపురంలో సోమవారం టిడిపి-జనసేన-బిజె ఉమ్మడి సమన్వయ జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి టిడిపి జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులు, జనసేన పార్టీ ఇంచార్జులు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, జనసేన+టిడిపి+బిజెపి ముఖ్య నాయకులు హాజరయ్యారు. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ నుండి ఇంచార్జ్ బాల్యం రాజేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ప్రచారం, మేనిఫెస్టో అంశాలు, ఉమ్మడి ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల గెలుపు అంశాలు గురించి చర్చించడం జరిగింది.