అగ్నికుల క్షత్రియ యువతతో టీ విత్ డాక్టర్ బాబు

  • TEA WITH DOCTOR BABU

జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, కరవాక గ్రామంలో అగ్నికుల క్షత్రియ యువతతో కలిసి వారు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు గోదావరి తీరాన ముఖాముఖి చర్చ జరిపి జనసేన పార్టీ సింబల్ అయినా గాజు గ్లాస్ తో టీ ఇచ్చి వారితో సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ సెక్రెటరీ పొన్నాల ప్రభ, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, మండల కార్యదర్శి బొమ్మిడి ఏడుకొండలు, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, రేకపల్లి కృష్ణాజి, గొళ్లపాలెం గ్రామశాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, గొంది గ్రామశాఖ అధ్యక్షులు కొల్లు వెంకతరాజు, రాపాక మహేష్, బొమ్మిడి ఏడుకొండలు తదితరులు.