కదిరి పట్టణంలో మెగా రక్తదాన కార్యక్రమం

ధర్మవరం: అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి, అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కదిరి పట్టణంలో ఏపీ ఎన్జీవో హోం నందు బుధవారం మెగా రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు డా. హుస్సేన్, మున్వర్, బ్లడ్ బ్యాంక్ ఇంచార్జీ శ్రీవాణి, విశిష్ఠ అతిథిగా కర్ణాటక రాష్ట్ర యూత్ లీడర్ మంజునాథ రాయల్ విచ్చేసి మెగాస్టార్ చిరంజీవి మంచితనం గురించి ఆయన సేవా కార్యక్రమాల గురించి, పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ప్రజా క్షేమం కోసం విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు వారి సేవా స్ఫూర్తితో మెగా అభిమానులు వారి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని మెగా బ్లడ్ క్యాంప్ లు ఏర్పాటు చేస్తున్నారని, అటువంటి రక్త దాతలే నిజమైన దేవుళ్ళు అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెగా సీనియర్ అభిమానులు, అఖిల భారత చిరంజీవి యువత ధర్మవరం నియోజక వర్గం అధ్యక్షులు కడపల సుధాకర్ రెడ్డి, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు మనోహర్, జయ వర్ధన్, హరి బాబు, చక్రి, కార్తిక్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.