ఘనంగా టీం పిడికిలి పోస్టర్ ఆవిష్కరణ

పాయకరావుపేట నియోజకవర్గం: నక్కపల్లి మండలంలో గల పోలీస్ స్టేషన్ ఎదురుగా టీం పిడికిలి విభాగ సభ్యులు బాలేపల్లి ఏసుబాబు, ఉగ్గిన రాము నేతృత్వంలో నక్కపల్లి మండల జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోస్టర్ యొక్క ఉద్దేశించి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఎవరిని పల్లకిలో మోయడానికి కాదు అంధకారంలో ఉన్న ప్రజలకు వెలుతురు ఇవ్వడం కోసం జనసేన అని చెప్పారు. పవన్ కళ్యాణ్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము అని తెలిపారు 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో అలాగే లోకల్ స్థానిక ఎన్నికల్లో తగ్గు కుంటూ వచ్చాం.. అధికార ప్రతిపక్షాలపై ప్రజలకు నమ్మకం లేక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక ఛాన్స్ కల్పించాలంటూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు అని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలు 2024 ఎన్నికలలో పాయకరావుపేట నియోజకవర్గం లో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కురందాసు అప్పలరాజు, అమలాపురం గ్రామ సర్పంచ్ గబ్బర్ సింగ్, జనసేన పార్టీ విశాఖపట్నం రూరల్ ప్రోగ్రాం కమిటీ మెంబర్ పిక్కి స్వామి, రమణ బాబు, రాజు, సత్య, తదితరులు పాల్గొన్నారు.