ఆత్రేయపురం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన బండారు శ్రీనివాస్

  • పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పలువురు పార్టీలో చేరిక

కొత్తపేట: ఆత్రేయపురం జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జి బండారు శ్రీనివాస్ ప్రారంభించారు. ఆదివారం ఆత్రేయపురంలో పర్యటించిన ఆయన అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముందుగా బండారుకు గ్రామంలోని మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. మండల అధ్యక్షుడు చేకూరి కృష్ణంరాజు, మండల ఉపాధ్యక్షుడు బండారు సుబ్రహ్మణ్యం(బాబీ), గ్రామ పార్టీ అధ్యక్షుడు యాతం శ్రీనివాస్(అబ్బిస్) ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన పార్టీ మండల కార్యాలయాన్ని శ్రీనివాస్ చేతులు మీదుగా ప్రారంభించి, భగవంతుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ జెండా స్థూపాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాగంగా పలువురు పవన్ కళ్యాణ్ ఆశయాల నచ్చి జనసేన పార్టీలో చేరారు. వారికి ఇంచార్జి బండారు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు విసుగు చెందారని జగన్ పాలనలో రాష్టం అధోగతి పాలైయిందన్నారు. రానున్న రోజుల్లో జనసేన అధికారం చేపట్టడం ఖాయమన్నారు, ఏపికి మంచి రోజులు రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు తాళ్ళ డేవిడ్, దొంగా వెంకట సుబ్బారావు, సంగీత సుభాష్, బొక్కా ఆదినారాయణ,రావులపాలెం మండల అధ్యక్షులు తోట స్వామి, చాట్ల మంగతాయారు కంఠంశెట్టి చంటి, తుల రాజు, సలాది జయప్రకాష్ నారాయణ, పడాల అమ్మిరాజు, తమ్మన భాస్కర్ రావు, కొత్తపల్లి నగేష్, పెపకాయల త్రిమూర్తులు, వంగా వెంకట సాయి, బందెల గురవయ్య, నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.