మరికాసేపట్లో ప్రారంభం కానున్నా తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిచనున్నారు. అనంతరం సభా నిర్వహణపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. చనిపోయిన సభ్యులకు మంగళవారం సంతాప తీర్మానాలు ఉంటాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై 17న చర్చ, సమాధానం, ఈ నెల 18న బడ్జెట్‌ సమర్పణ, 20 నుంచి బడ్జెట్‌, పద్దులపై చర్చ ఉంటాయి. గత శాసనసభ సమావేశాల్లో అమలు చేసిన కొవిడ్‌ నిబంధనలే ఈ సమావేశాల్లోనూ అమల్లో ఉంటాయని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‎రెడ్డి స్పష్టం చేశారు. మాస్క్‌ లేకుంటే సభకు రావద్దని చెప్పా రు. కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్న వారికి సభా ప్రాంగణంలోనికే అనుమతి లేదన్నారు. అసెంబ్లీలో కొవిడ్‌ పరీక్షలు శుక్రవారం నుంచే నిర్వహిస్తారు. కాగా.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశంలో జరగనుంది.