ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, అందరినీ పాస్ చేయడం తెలిసిందే. అయితే, విద్యాసంవత్సరంలో నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్ మెంట్ పరీక్షల ఆధారంగా ఫలితాలు రూపొందించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభను పరిశీలించి గ్రేడ్ లు కేటాయించారు. ఈ నేపథ్యంలో, పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విజయవాడలో విడుదల చేశారు. ఫలితాలను bse.ap.gov.in వెబ్ సైట్లో పొందుపరిచారు.