జనసైనికులకు ఏ కష్టం వచ్చినా జనసేన అండగా నిలుస్తుందని

  • పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ

కాకినాడ రూరల్, కరప మండలం పెదకొత్తూరు గ్రామంలో గత సంవత్సరం జరిగిన జాతరలో వైసీపీ నాయకులు కక్షతో స్థానిక జనసైనికులపై అక్రమ కేసులు బనాయించగా కోర్టు వారి కేసుని కొట్టివేసిన కారణంగా, జనసైనికుల తండ్రులు మరియు జనసేన పార్టీ పెద్దలు కలిసి నేడు కాకినాడలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ కి కృతజ్ఞతలు తెలియచేసారు. ఆనాడు జనసైనికులకు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడి, దైర్యం చెప్పినందులకు ధన్యవాదములు తెలియచేసిన జనసైనికులు. వారందరికీ నానాజీ అభినందనలు తెలుపుతూ, జనసైనికులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా నిలుస్తుందని చెప్పడం జరిగింది.