నష్టపోయిన చోళ్లు రైతులను ఆదుకోవాలి

అరకు నియోజకవర్గంలో తుపాను వల్ల నష్టపోయిన చోళ్లు పంటను జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా పరిశీలించారు. పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం ఇచ్చి దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా అనంతగిరి మండలంలోని పలు గ్రామాలలో కూడా సాయిబాబా పర్యటించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నెట్ వర్క్ లేక అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించారు. టవర్ ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. జనసైనికులు కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.