ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థుల మీద దాడి పిరికి పందచర్య

  • తాతంశెట్టి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి

రైల్వే కోడూరు: పెనగలూరు మండలంలో వైసీపీ పార్టీ ఓటమి తప్పదని తెలిసి కూటమి నాయకుల మీద తమ గుండాలచేత దాడి చేయించడం, తుపాకులు చూపి బెదిరించి భయబ్రాంతులకు గురిచేసిన చర్యను తీవ్రంగా ఖండిఒచారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యకు తావులేదని, ఇది నీతిమాలిన పనిఅని తీవ్రంగా విమర్శించారు… పెనగలూరు మండలంలో చిన్నవెంగల్ రెడ్డి చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీ లో చేరారని ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గూండాలు బెదిరించి, భయపెట్టి బలవంతాన వైసీపీ కండువాకప్పి ఆయనిని లాకెళ్లారు.. నిన్నటి రోజు మరొక మాకూటమి నాయకుడు వెంకటేశ్వరరెడ్డి గారి ఇంటి మీద చిత్తూరు నుంచి వచ్చిన ఎంపీ అనుచరులు దాడిచేసి తుపాకితో బెదిరించి ఊరిలో ఉండద్దు ఎన్నికలు ఐపోయినంతవరకు అని బెదిరించడం సభ్యసమాజం సిగ్గు పడే చర్య అని ఆయన తెలియపరిచారు.. ఈ విషయం సీరియస్ గా తీసుకుని ఎస్ పి గారికి ఫిర్యాదు చేయడమే కాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, టీడీపీ ఇంచార్జ్ రూపానంద రెడ్డిగారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ సి గారికి కూడా ఈ విషయాన్ని తెలుపడం జరిగింది. ఇలాంటి నీచమైన చర్యలతో గెలుస్తామనుకోవడం మీ భ్రమ.. ఎన్.డి.ఏ కూటమి విజయం ఎప్పుడో ఖరారు అయిందని, ప్రజలు బ్రాహ్మరధం పడుతున్నారు మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతమైతే గట్టిగా సమాధానం చెబుతామని పెనగలూరు ప్రచారం ఉదృతం చేస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో పాటు సీనియర్ టీడీపీ నాయకులు కొమ్మన వెంకట సుబ్బారెడ్డి, సంగరాజు శ్రీధర్ రాజు, సూర్యాల ధర్మయ్య, తురక చంగల్ రాయుడు ఈశ్వరయ్య, దాడిశెట్టి మల్లికార్జున, జనసేన పార్టీ నుంచి రామ రాజ, తాతంశెట్టి నరసింహ ప్రసాద్ తిమ్మిశెట్టి మణి, పుల్లగంటి శివ, తురక వెంకటేష్, బీజేపీ నుంచి మండలాధ్యక్షుడు బాపూజీ కొమ్మన నాగార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.