దేశవాళీ క్రికేట్కు ముహూర్తం ఖరారు చేసిన BCCI
కరోనా కారణంగా గత తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన దేశవాళీ క్రికెట్ పోటీలను పునఃప్రారంభించడానికి బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది. కొత్త సంవత్సరం ఆరంభంలో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో దేశవాళీ సీజన్ నిర్వహణకు ఓకే చెప్పింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాది తర్వాత దేశవాళీ క్రికెట్ అభిమానులను అలరించనుంది. ముస్తాక్ అలీ టోర్నీకి సంబంధించి ఇప్పటివరకైతే వేదికల్ని నిర్ణయించలేదు. జనవరి 2 తర్వాత ఏయే వేదికల్లో మ్యాచ్లు నిర్వహిస్తారో ఫైనల్ కానుంది.
ముస్తాక్ అలీ టోర్నీతో పాటు దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ షెడ్యుళ్లను సైతం బీసీసీఐ ప్రకటించనుంది. అయితే కరోనా కారణంగా ఆటగాళ్లు ఏ నిబంధనలు పాటించాలనే అంశంపై కూడా బీసీసీఐ కసరత్తు చేస్తోంది. దేశవాళీ క్రికెట్కు సంబంధించి బబుల్ నిబంధనలు ఉంటాయా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.