చందుపట్ల కీర్తి రెడ్డిని గెలిపించాలని జేరిపోతుల ప్రచారం

తెలంగాణ, జనసేన పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ సీనియర్ జిల్లా నాయకులు జేరిపోతుల సనత్ కుమార్ జనసేన బలపరచిన భూపాలపల్లి నియోజకవర్గ బిజేపి అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి తరపున భూపాలపల్లిలోని 20వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. జనసేన బలపరచిన భూపాలపల్లి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డికి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించమని ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.