వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి

రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు పేర్కొన్నారు. ప్రతిపక్షపార్టీలు నిరసనలు, సభలు పెట్టరాదని వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టి పోలీసులను ప్రతిపక్ష పార్టీలపైకి ఉసిగొల్పడం దారుణమని కాశెట్టి సంజీవరాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని కానీ ఇలాంటి దారుణమైన పాలన చేయలేదని తెలిపారు. అప్రజాస్వామిక పాలన చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన రీతిలో జవాబును వచ్చే ఎన్నికల్లో ప్రజలు చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు.