మన్యంలో మైనింగ్ కోసమే కుంభ రవిబాబుకు ఎమ్మెల్సీ పదవి.. మురళి

  • అనంతగిరి జనసేన పార్టీ మండల అధ్యక్షులు మురళి

ఏజెన్సీలోని మైనింగ్ కోసమే వైసిపి అధిష్టానం కుంభ రవిబాబుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెడుతున్నది అని అనంతగిరి జనసేన పార్టీ మండల అధ్యక్షులు మురళి విమర్శించారు. ఎస్టీ చైర్మన్ రవి బాబుకు గవర్నర్ కోట ఎమ్మెల్సీగా వైసిపి ప్రకటించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మైనింగ్ ఏజెంట్గా ఉన్నందుకే గుంటూరు ప్రాంతానికి చెందిన రవిబాబుకు ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎమ్మెల్సీ పదవులను కట్టబెడుతూ ఉన్నారు. వాస్తవానికి ఉమ్మడి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేకమంది వైసీపీ నేతలు ఉన్నప్పటికీ కేవలం మైనింగ్ కోసమే రవిబాబు సైతం అరకులోయ అనంతగిరి మండల నిమ్మలపాడు ప్రాంతాలలోని గిరిజనులకు డబ్బు ఎర చూపి, వారి వెంట తిప్పుకుంటారని అలాగే కొన్ని ప్రాంతాలలోనూ భూములను కబ్జా చేశారని మురళి ఆరోపించారు. ఏజెన్సీలో అనారోగ్యంతో గిరిజనుల మరణాలు మరియు ఇతర సమస్యలపై ఎన్నాడు దృష్టి పెట్టని రవిబాబుకు గిరిజనులకు చెందని పదవులు ఇవ్వడం వెనుక మైనింగ్ మాఫీయ ఉందన్నారు. రవిబాబు లాంటి వ్యక్తులతో స్థానిక గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.