ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు గద్దర్ మరణం తీవ్ర విషాదకరం

  • గద్దర్ కు చిన్నగంజాం జనసేన ఆధ్వర్యంలో ఘన నివాళులు

పర్చూరు: ప్రముఖ ప్రజా గాయకుడు మరియు యద్ద నౌక అనే పిలవబడే గుమ్మడి విట్టల్ రావు అలియాస్ గద్దర్ కు జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నగంజాం మండల అధ్యక్షులు సందు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సైతం ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణం. జనసేన పార్టీ తరపున నివాళులు అర్పిస్తూ, ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ కడవకుదురు కార్యాలయం నందు నివాళులర్పిస్తూ కార్యాలయంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో చిన్నగంజం మండల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి హరిబాబు, యువ నాయకులు తోట అశోక చక్రవర్తి, పూల అనిల్, గొల్లపూడి లక్ష్మణ, కుంచనపల్లి నాగేశ్వరరావు, ఎడవల్లి బ్రహ్మయ్య, శివకోటి ముసలయ్య, సిగిరిశెట్టి రామకోటేశ్వరరావు, శివకోటి నారాయణ, అడుసుమళ్ళీ మణి, మధ్యల ప్రభాకర్ రావు, బోడపాటి బంగారయ్య తదితరులు నివాళులర్పించారు.