ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు గద్దర్ మరణం తీవ్ర విషాదకరం: శంకర్ గౌడ్

హైదరాబాద్, తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సైతం ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణం సందర్భంగా జనసేన పార్టీ తరపున నివాళులు అర్పిస్తూ, ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. ఆయన భౌతికకాయానికి తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ అధ్యక్షులు రాధారం రాజలింగం నివాళులర్పించడం జరిగింది.