Hyderabad: సింగరేణి కార్మికుల మృతి బాధాకరం: నేమూరి శంకర్ గౌడ్

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి శృఫ్3 బొగ్గు గనిలో మొదటి షిఫ్ట్ నిర్వహిస్తుండగా పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు అనే వార్త నన్ను చాలా బాధకి గురిచేసింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ ఆ సభ్యులకి జనసేన పార్టీ తెలంగాణ తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని… వారితో పాటు పనిలో ఉన్న మిగతా కార్మికులకి గాయాలు అయ్యాయి. వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలంగాణా జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు.