సర్దార్ మరిపెళ్ళ చిట్టి కు ఘన నివాళులర్పించిన పోతిన మహేష్

విజయవాడ వెస్ట్: సర్దార్ మరిపెళ్ళ చిట్టి 124 వ జయంతి సందర్భంగా విజయవాడలోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ వద్ద ఉన్న విగ్రహానికి స్థానిక డివిజన్ అధ్యక్షులు శిగినంశెట్టి రాము ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, నాగరాజు, సాంబ, రామకృష్ణ, అక్షయ్, నాని మరియు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.