భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న ఉప ముఖ్యమంత్రి

  • ఇన్చార్జిని అక్రమంగా అరెస్టు చేయాలనుకోవడం ప్రజాస్వామీకం
  • తగ్గేదేలే అంటున్న జనసైనికులు

గంగాధర నెల్లూరు, కార్వేటి నగరం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు శోభన్ బాబు నియోజకవర్గ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ పై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అక్రమ కేసులు పెట్టడాన్ని తప్పు పట్టారు. డాక్టర్ యుగంధర్ పొన్న ఎన్నో ప్రజా సమస్యల మీద ఈ మూడున్నర సంవత్సర కాలంలో ఎన్నో ప్రజా పోరాటాలు చేశారని, నియోజకవర్గంలో ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే, ఎక్కడ ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తాయో, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటారో అక్కడికి వెళ్లి తన పరిధిలో సహాయ సహకారాలు అందించారు. అలాంటి మా నాయకుడి మీద కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టు చేయాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, మా ఇంచార్జ్ యుగంధర్ పొన్నకి, నియోజకవర్గ జనసేన నాయకులకు పోలీసులు అంటే చాలా గౌరవమని తెలిపారు. పోలీసులకు కూడా మేము చెప్పటం ఏమిటంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఉన్నత భాగం పోలీసులది. మీకు ఏదైనా అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉంటే మీరు వారికి సర్ది చెప్పాలి. ఇలాంటి అప్రజాస్వామికమైన వాటికి సహకరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని తెలియజేశారు. ఇలాంటి అప్రజాస్వామికమైన వాటిని జనసేన పార్టీ ఎప్పుడు వ్యతిరేకిస్తుంది మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే జనసైనికులమైన మేము ఇలాంటి అక్రమ కేసులను పెట్టడాన్ని ఖండిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వెదురుకుప్ప మండల అధ్యక్షులు పురుషోత్తం, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, కార్వేటినగరం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, ప్రధాన కార్యదర్శులు కావలి సతీష్, చంద్రమౌళి, కార్యదర్శులు సూర్య నరసింహులు, మణికంఠ, చిరంజీవి, జిల్లా సంయుక్త కార్యదర్శి కోలార్ వెంకటేష్, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, శేఖర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.