దుమ్ములేపిన బొబ్బిలి జనసేన ర్యాలీ

  • పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

బొబ్బిలి: జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో శుక్రవారం బొబ్బిలి జనసైనికుల నిలయం నుంచి తాండ్రపాపారాయుడు బొమ్మ వరకు జనసైనికులు, వీరమహిళల కోలాహలం మధ్య జై జనసేన నినాదాలతో ప్రజలందరి సానుకూల స్పందనతో ముందుకు సాగింది జనసేన ర్యాలీ. ఈ ర్యాలీ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్ మీదుగా గాంధీ బొమ్మ దగ్గరకి చేరి గాంధీజికి పూలమాల వేసి స్టేట్ బ్యాంక్ మీదుగా వెళ్లి శ్రీ అంబేద్కర్ కు పూలమాల వేసి తదనంతరం తాండ్రపాపారాయ బొమ్మ దగ్గరకు విజయవంతంగా చేరుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి మంగళ హారతులిచ్చి, పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గం నాలుగు మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వీరమహిళలు, బొబ్బిలి పట్టణ యువ నాయకులు, జనసైనికులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో ఐకమత్యంగా విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు.