ప్రతి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ చేయాలి: గర్భాన సత్తిబాబు

పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఆదివారం మదర్స్ డే సందర్భంగా బాసురు లక్ష్యంపురం గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో రాజుపేట సెంటర్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు చలివేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కొరకు ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను అలాగే కౌలు రైతులకు 30 కోట్ల ఆర్థిక సహాయం చేయడాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళే విధంగా ప్రచారం కొనసాగించాలని, జనసైనికులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో గ్రామస్థాయి పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో జండా ఆవిష్కరణ చేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.