వైసిపి విముక్తి ఆంధ్ర ప్రదేశ్ జనసేన లక్ష్యం

గజపతినగరం: జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేష్ ఆదివారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు, వీరమహిళలకు, జనసైనికులకు, మెగా అభిమానులకు మన పార్టీ నిర్ణయాన్ని గౌరవించి, ప్రకటించే స్థానాల కంటే, పవన్ కళ్యాణ్ గారు గురిపెట్టిన లక్ష్యాన్ని చూడాలి. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనం పని చేయాలి అని నాయకులకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు డా.రవికుమార్ మిడతాన, వీరమహిల దుర్గ, గజపతినగరం నాయకులు కలిగి పండు, శ్రీను, లక్ష్మణ, రాంబాబు, ఏర్ని నాయడు, బాలు, ఆదినారాయణ, అప్పారావు, బాలకృష్ణ, గౌరీ నాయడు, మహేష్, హేమ సుందర్, ప్రశాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.