జనసేన ప్రచార రథాలు ప్రారంభించిన శ్రీ నాగబాబు

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు ఎన్ఆర్ఐ శ్రీ కొట్టే ఉదయ్ భాస్కర్ సమకూర్చిన ప్రచార రథాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు ప్రారంభించారు. శనివారం సాయంత్రం, మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 వాహనాలకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ కొట్టే ఉదయ్ భాస్కర్ ను అభినందించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు చేరువ చేస్తూ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి విజయానికి దోహదపడాలని ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఉదయ్ భాస్కర్ సోదరులు శ్రీ కొట్టే వెంకట్రావు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.