మదనపల్లె జిల్లా సాధనే ధ్యేయంగా సకల జనుల సమరభేరి: గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె జిల్లా, సాధనకై ఎన్నో ఉద్యమాలు చేసిన వారికి అక్రమ అరెస్టులు, కేసులతో జిల్లా ఉద్యమం ఆగలేదని తిరిగి ఉవేత్తున ఎగిసి పడుతుందని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. ఈ నెల 20 వ తేదిన బహుజన సేన ఆధ్వర్యంలో జరుగే సకల జనుల సమరభేరి ఐక్యత ర్యాలీపై బహుజన యువసేన అధ్యక్షులు శ్రీచందు, గంగారపు రామదాస్ చౌదరి తోపాటు జనసేన పార్టీ నాయకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ మదనపల్లెకు జిల్లా ఆకాంక్ష మరింత బలంగా వినిపించేందుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర కార్యదర్శి కొండుపల్లి ఆనంద్, ఆటో యూనియన్ నాయకులు రాఘవేంద్ర యాదవ్, అన్నమయ్య జిల్లా సెక్రెటరీ రూపక్ నాయక్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, నిమ్మనపల్లి అధ్యక్షులు ప్రదీప్ సింగ్, తాళ్ల గిరి, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, తోట కళ్యాణ్, జయ, జనర్ధన్, కార్యకర్తలు జెన్నిత్, గంగాధర్, రోహిత్, చరణ్, రాజా పాల్గొన్నారు.