నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి

  • తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన గూడూరు మండల రైతులను పరామర్శించిన పెడన జనసేన నాయకులు
  • ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని జనసేన డిమాండ్ 

పెడన: మాండస్ తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. చేతికి వచ్చిన పంట నేలపాలైంది. అకాల వర్షానికి రైతులు తీవ్ర నష్టపోయారు. తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన గూడూరు మండల రైతులను శనివారం పెడన జనసేన నాయకులు పరామర్శించి, వారి పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు. . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో గూడూరు మండలం, మద్దిబట్ల గ్రామంలో చేతికొచ్చిన పంట పొలాలు మునిగిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు, వరి కోత అయ్యి, వరి పనలు నీటిలో ములగటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు, పొలాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల మినుము పూర్తిగా పైరు కూడా దెబ్బతింది, వర్షం నీరు పోయేటందుకు మురికి కాలువలు సరిగా లేకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు, తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బత్తిన హరి రామ్, ఎస్ వి బాబు, గంటా రవి, గుడివాడ రాజా, ఉడుముల ప్రతాప్, మున్నా, శీరం సంతోష్, గల్లా హరీష్, కనపర్తి వెంకన్న, సీట్ల నవీన్ కృష్ణ, దాసరి నాని, పినిశెట్టి రాజు, ఒగ్గు సాయి, పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.